జగన్ కి తలనొప్పిగా మారిన ఎమ్మెల్యేలు

ఏపీలోని అధికార పార్టీ వైకాపాాకి సొంత పార్టీ ఎమ్మెల్యేల నుండి తలనొప్పి ఎక్కువైతోంది. రోజుకో ఎమ్మెల్యే తమ పార్టీ పైనే బహిరంగంగానే సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే ఆనం, కోటంరెడ్డిలతో దాదాపు తెగదెంపులు చేసుకున్న పార్టీకి మరో ఎమ్మెల్యేతో ఇబ్బంది మొదలైంది. వచ్చే ఎన్నికల్లో వైకాప నుండి పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళ్తే… కర్నూలు జిల్లాలోని ఉల్చాలలో ‘గడపగడపకు’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఎమ్మెల్యే సుధాకర్‌పై ఆ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు బుర్ర పెద్ద వెంకటేశ్ నాయుడు విరుచుకుపడ్డారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వాళ్లను మీరు పక్కనపెట్టారని, మీరు నమ్మక ద్రోహి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు టికెట్ ఇప్పించేందుకు కష్టపడిన వారందరినీ పక్కనపెట్టేశారని ఆరోపించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని అందలం ఎక్కించుకున్నారని, ఇంతటి నమ్మక ద్రోహం చేస్తారని అనుకోలేదని మండిపడ్డారు. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలతో నొచ్చుకున్న సుధాకర్.. రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోనని తేల్చి చెప్పారు. సుధాకర్ వ్యాఖ్యలు ప్రస్తుతం పార్టీ లో చర్చ గా మారాయి.

Leave a Reply

%d