వన్డే ప్రపంచకప్ కోసం టిక్కెట్లు దక్కలేదని నిరాశ పడుతున్న క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. అక్టోబర్-నవంబర్ నెలల్లో జరిగే ప్రపంచకప్ కోసం మరో 4 లక్షల టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఈ టిక్కెట్ల అమ్మకాలను ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో కూడా బీసీసీఐ వెల్లడించింది. వరల్డ్ కప్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్ర సంఘాలతో పలు మార్లు చర్చించి ఎంతోమంది క్రికెట్ను అభిమానించే వాళ్ల కోసం అదనంగా టిక్కెట్లను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. చారిత్రక ఈవెంట్లో వీలైనంత ఎక్కువ మందిని భాగస్వాములను చేయడం కోసం క్రికెట్ అభిమానులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించామని బీసీసీఐ పేర్కొంది.