మేడపై నిద్రిద్దామన్న భార్యతో గొడవకు దిగిన ఓ వ్యక్తి ఆమెపై హత్యాయత్నం చేశాడు. తనను అడ్డుకోబోయిన కూతురిని దారుణంగా పొడిచి చంపేశాడు. గుజరాత్లోని సూరత్ జిల్లాలో జరిగిందీ ఘటన. బీహార్కు చెందిన రామానుజ్ మహాదేవ్ సాహు, రేఖాదేవి దంపతులు జిల్లాలోని కడోదర ప్రాంతంలో నివసిస్తుంటారు. వీరికి ముగ్గురు కుమారులు, ఓ కూతురు ఉంది. గురువారం రాత్రి రేఖాదేవి మేడపై నిద్రిద్దామని భర్తను కోరింది. ఇందుకు అభ్యంతరం చెప్పిన మహాదేవ్ భార్యతో గొడవకు దిగాడు.
For More News Click: https://eenadunews.co.in/
ఆ తరువాత ఇంట్లోంచి వెళ్లిపోయిన అతడు కత్తితో తిరిగొచ్చి భార్యపై దాడికి దిగాడు. ఈ క్రమంలో తనకు అడ్డొచ్చిన 19 ఏళ్ల కూతురిని 17 సార్లు దారుణంగా పొడిచి చంపేశాడు. ఈ ఘటనలో అతడి ముగ్గురు కుమారులు కూడా గాయపడ్డారు. కూతురిని హత్య చేశాక పరారైన నిందితుడిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు.