తెలంగాణ రాజకీలయాల్లో పరీక్షల పేపర్ల లీకులు, ఆరోపణలు, అరెస్టులులతో అట్టుడుకుతన్నాయి. అయినా కానీ అన్యాయం ముందు ధర్మమమే గెలిచిందని అంటున్నారు భాజపా నేతలు. ధర్మం ముందు ప్రతి ఒక్కరూ తల వంచాల్సిందేననడానికి ఇది ఒక నిదర్శనమని పేర్కొన్నారు.
పదవ తరగతి హిందీ పేపర్ లీక్ విషయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని వరంగల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బెయిల్ మీద అతను గురువారం రాత్రి విడుదలయ్యారు. హనుమకొండ ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ అనితా రాపోల్ ఆయనకు షరతులతో బెయిల్ ఇస్తూ తీర్పు ఇచ్చారు. ఇద్దరు వ్యక్తుల హామీ, రూ.20 వేల పూజీకత్తుతో బెయిల్ లభించింది. మేజిస్ట్రేట్ తీర్పు ప్రకారం.. బండి సంజయ్.. దేశం విడిచి వెళ్లకూడదు. అలాగే ఈ కేసు విచారణకు సహకరించాలి.