దక్షిణ భారతదేశంలో తన ఉనికిని బలోపేతం చేసుకునే లక్ష్యంతో, భారతదేశంలోని ప్రముఖ మ్యాట్రెస్ బ్రాండ్, సెంచరీ మ్యాట్రెస్, దాని హైబ్రిడ్ కలెక్షన్: జెల్ లాటెక్స్ మ్యాట్రెస్కి మరొక కొత్త రకాన్ని విపణిలోకి తీసుక వచ్చింది. హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన పార్టనర్ కనెక్ట్ మీట్లో ఈ ఆవిష్కరణ జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్ అయిన రామోజీ ఫిల్మ్ సిటీలో ఆగస్ట్ 7 నుండి ఆగస్టు 9, 2023 వరకు ఈ వేడుక జరిగింది. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సెంచరీ డీలర్లను ఒకచోట చేర్చింది, వారికి కొత్త పథకాలపై వివరాలను అందించింది మరియు వారి విజయాలను అవార్డులతో గుర్తించింది. శ్రీమలానీ గ్రూప్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ పురుషోత్తమ్ మలానీ ద్వారా మ్యాట్రెస్ విడుదల వేడుకను ప్రారంభించారు.