థాయిలాండ్ లో చీకోటి ప్రవీణ్ అరెస్ట్

క్యాసినో నిర్వహకుడు చికోటి ప్రవీణ్‌ థాయ్‌లాండ్‌లో అరెస్ట్ అయ్యాడు. థాయ్‌లాండ్ పట్టాయాలోని ఓ విలాసవంతమైన హోటల్‌పై సోమవారం తెల్లవారుజామున అక్కడి పోలీసులు దాడి జరిపి పెద్ద మొత్తంలో గ్యాంబ్లింగ్ జరుగుతున్నట్టుగా గుర్తించారు. మొత్తం 93 మందిని అరెస్ట్ చేయగా.. అందులో 80 మంది భారతీయులు ఉన్నారు. అరెస్ట్ అయినవారిలో చికోటి ప్రవీణ్ కూడా ఉన్నారు. నిందితుల నుంచి భారీగా నగదు, గేమింగ్ చిప్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకన్నారు. గేమింగ్ చిప్స్‌ విలువ రూ. 20 కోట్లకు పైగా ఉంటుందని స్థానిక పోలీసులు చెబుతున్నారు.

వివరాల్లోకి వెళ్లే… థాయ్‌లాండ్‌లో భారీ గ్యాంబ్లింగ్ రాకెట్‌లో తెలంగాణకు చెందిన చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి (హైదరాబాద్‌లో ఈడీ కేసులో ఏ1), మెదక్ డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి సహా 80 మంది భారతీయ జూదగాళ్లను అరెస్టు చేశారు. నివేదికల ప్రకారం, చికోటి ప్రవీణ్ థాయ్‌లాండ్ మహిళలతో కలిసి పట్టాయాలో జూదం డెన్‌ను ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. జూదం ఆడేందుకు హైదరాబాద్‌తో పాటు భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులను తీసుకొచ్చారని ఆరోపించారు. ఈ బృందం సోమవారం ఉదయం భారత్‌కు వెళ్లాల్సి ఉండగా, పోలీసులు అర్థరాత్రి హోటల్‌పై దాడి చేసి వారిని పట్టుకున్నారు. బ్యాంగ్ లాముంగ్ జిల్లాలోని టాంబోన్ నాంగ్ ప్రూలోని సోయి ఫ్రా తమ్నాక్ 4లోని ఆసియా పట్టాయా హోటల్‌లో జరిగిన దాడిలో 80 మంది భారతీయులను అరెస్టు చేసినట్లు థాయ్ పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 27 నుండి మే 1 వరకు హోటల్‌లో అనేక మంది భారతీయులు గదులు బుక్ చేసుకున్నారని మరియు సంపావో అనే కాన్ఫరెన్స్ రూమ్‌ను జూదానికి ఉపయోగిస్తున్నారని డిటెక్టివ్‌ల నుండి వచ్చిన సమాచారం మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. జూదగాళ్ల వద్ద మొత్తం 100 కోట్లు పట్టుబడినట్లు సమాచారం. ప్రధానంగా బౌద్ధ దేశమైన థాయ్‌లాండ్‌లో జూదం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది.

Leave a Reply

%d bloggers like this: