ప్రభుత్వాన్ని సిగ్గు లేదు – రాంచందర్ నాయక్

తెలంగాణ సర్కార్ పై మండిపడ్డారు డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి మరియు పిసిసి సభ్యులు డాక్టర్ రాంచందర్ నాయక్. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే బాధ్యులపై కనీస చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మొన్న డాక్టర్ ప్రీతీ…?నిన్నా ఇంజనీర్ నవీన్…?నేడు ఇంజినీర్ రక్షిత…?విద్యార్ధుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం అసలు తెలంగాణ రాష్ట్ర గిరిజన జాతిపై చాలా కుట్రలు-కుతంత్రాలు జరుగుతున్న ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ట్వీటర్ పిట్ట మూగబోయింది. ఈ బిడ్డపడ్డ ఆవేదన నరకం ఆ తల్లదండ్రుల మనోవేదన మంత్రులకి ఎమ్మెల్యేలకు ఈ ప్రభుత్వానికి వినిపించడం,కనిపించడం లేదా? అమ్మాయిల ముసుగులో మరో గిరిజన బిడ్డ నవీన్ ను అత్యంత పాశవీకంగా గుండెను బయటికి తీసి ముక్కలు ముక్కలుగా చేసిన హరిహర కృష్ణ అనే అగ్రకులానికి చెందిన వ్యక్తి. సీనియర్ వేధింపుల వల్ల మరో ఇంజనీరింగ్ కళాశాల అమ్మాయి రక్షిత ఆత్మహత్య. అసలు తెలంగాణ రాష్ట్రలో గిరిజనులపై పేదప్రజలపై మీద ఎందుకు ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి. అయ్యా కేసిఆర్ గారు కేటీఆర్ గారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారా. మీరు అందరు తెలంగాణ లో గిరిజన బిడ్డలపై పేద ప్రజల బిడ్డపై హత్యలు ఆగహిత్యలు జరుగుతున్న ఇప్పటివరకు స్పందించడంలేదు. ముఖ్యమంత్రి ఉన్నారా అసలు ముఖ్యమంత్రి, మంత్రుల ఇంట్లో ఇలాంటి ఘటనలు అయితే చూస్తూ ఉండేవారా ముఖ్యమంత్రికి సిగ్గు ఉందా?ముఖ్యమంత్రి ఇంట్లో కుక్క చనిపోతే వైద్యుడు మీద కేసు పెట్టి జైలుకి పంపిన నీచుడు ముఖ్యమంత్రి. సీఎం ఇంట్లో కుక్కకి ఉన్న విలువ గిరిజన ఆదివాసి పేద ప్రజలపై లేదా? మొత్తానికి డాక్టర్ ధరవత్ ప్రీతిని చంపేశారు. ఒక గిరిజన అమ్మాయి మెడికల్ పీజీ స్థాయికి రావాలంటే ఆ తల్లిదండ్రులు,ఆ అమ్మాయి ఎన్నిన్ని త్యాగాలు చేయాలో ప్రీతి ఎంత గా కష్టపదిందో! కానీ మొత్తానికి మొత్తంగా ప్రీతి భూమి మీద లేకుండా చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ప్రీతి సీనియర్ అయిన సైఫ్ ర్యాగింగ్, వేధింపులు మరియు కాలేజీ ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వల్ల ప్రీతి మరణం. ఎన్నో ఆటంకాలను అధిగమించి ఈ స్థాయికి వచ్చిన ప్రీతి అర్థాంతరంగా చనిపోవడం బాధాకరం. మనం అంతా సిగ్గుపడే విషయం. తెలంగాణలో ఆడపిల్లలకు రక్షణ కల్పించని ముఖ్యమంత్రి గిరిజన మంత్రి ఎంపీ ఎమ్మెల్యే అందరు రాజీనామా చేయాలి. అమ్మాయిలను వేధిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ తరుపున,గిరిజన బిడ్డగా,ఒక డాక్టరుగా డిమాండ్ చేస్తున్న ప్రిన్సిపల్ నిర్లక్ష్యం క్షమించరానిది వారిపై కూడా కఠిన చర్యలు తీసుకొవాలి. భవిష్యత్తులో ఆడబిడ్డ పట్ల ఇలాంటి నిర్లక్ష్యం చూపకుండా చూడాలి.భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతంగా కాకుండా,ర్యాగింగ్ నిరోధక చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. ఈ సందర్భంగా డాక్టర్ ప్రీతి మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు,

Leave a Reply

%d