హీరోగా ఎంట్రీ ఇస్తున్న రవితేజ తమ్ముడి కొడుకు

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరో వారసుడి తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది. మాస్ మహారాజా రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా పేరు ‘మిస్టర్ ఇడియట్’. టైటిల్ అనౌన్స్ చేశారు. టైటిల్ పోస్టర్ ను రవితేజ విడుదల  చేశారు. గతంలో రవితేజ-పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన ‘ఇడియట్’ ఎంతపెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ‘మిస్టర్ ఇడియట్’ గా మాధవ్ వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఇక, ఈ సినిమాకు గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. గౌరి ఇంతకుముందు ‘పెళ్లిసందD’ చిత్రంతో మెగాఫోన్ పట్టారు. ‘మిస్టర్ ఇడియట్’ చిత్రానికి జేజేఆర్ రవిచంద్ నిర్మాత. ఈ సినిమా ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకుంది. హైదరాబాదులో లాంఛనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

 

Leave a Reply

%d