విశాఖ స్టీల్స్ ని కొనే ప్లాన్ లో కేసీఆర్

ఏపీ ప్రజలను మక్కువ చేసుకోవడానికి తెలంగాణ సీఎం శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే భారసని విస్తరించే ప్రయత్నంలో ఏపీలో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అయితే ఎన్నికల సంఘం ఆ పార్టీకి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రాంతీయ పార్టీ హోదా విషయంలో ఏపీలో అవకాశం లేకుండా పోయింది. దీంతో కేసీఆర్ కి ఆదిలోనే దెబ్బ తగిలింది.

అయితే రూటు మార్చిన కేసీఆర్ విశాఖ మీద ఫోకస్ పెట్టారు. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని ఒంట బట్టించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

కేంద్రం ఇప్పటికే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేయాలని నిర్ణయించింది. దాన్ని అలాగే ఉంచండి, అని రాష్ట్రప్రభుత్వం పలుమార్లు కోరినా కేంద్రం వినడం లేదు. అమ్మేద్దాం.. ఎలా ఉన్నాసరే వదిలించు కుంటామని కేంద్రం చెబుతోంది. ఈమేరకు అంతర్జాతీయ బిడ్లు ఆహ్వానించాలని కేంద్రం భావిస్తోంది. అయితే సరిగ్గా ఈ అంశం కేసీఆర్‌కు అవకాశంగా దక్కిందని అంటున్నారు. కేంద్రం అమ్మేయాలనుకుంటున్న విశాఖ ఉక్కుకు తాము సైతం బిడ్లు వేస్తామని, వేలంలో ఆ కంపెనీని దక్కించుకుంటామని కేసీఆర్ భావిస్తున్నారు. ఈమెరేకు ఈమధ్య కేటీఆర్ సైతం ఉక్కును అమ్మేయొద్దని, ప్రయివేటీకరణ చేయొద్దని కేంద్రాన్ని కోరారు. సింగరేణి సంస్థ ద్వారా ఈ ప్రక్రియను చేపట్టేందుకు కేసీఆర్ చూస్తున్నారు.

ఈమేరకు త్వరలో కొందరు అధికారులు విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించి పరిశీలిస్తారని అంటున్నారు. దీని ద్వారా ఆంధ్రప్రజల మద్దతు పొందేందుకు వీలు దక్కుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. మొత్తానికి ఆంధ్ర పాలిటిక్స్ లోనికి అడుగు పెట్టడానికి కేసీఆర్ కు ఒక అవకాశం దక్కిందని అంటున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ ఆర్ధిక పరిస్థితి ఏమాత్రం బాలేదని, జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేని పరిస్థితుల్లో వేలకోట్లు పెట్టి స్టీల్ ప్లాంట్ ఎలా కొంటారని, ఇదంతా ఓ బూటకం అని విమర్శించేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ అయన లెక్కలు ఆయనకు ఉన్నట్లు చెబుతున్నారు.

Leave a Reply

%d bloggers like this: