500 వందలకే వంట గ్యాస్

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 500 వందలకే వంట గ్యాస్ ఇస్తామని అన్నారు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.  హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా మహిళా రైతులతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. భూమి లేని రైతులకు రూ.15 వేలు, రూ.500 కే గ్యాస్ సిలిండర్, డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని వారిని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

%d