నూతన జాతీయ విద్యా విధానం ద్వారా దేశంలో దూరదృష్టిగల, భావి కాల లక్షణాలున్న విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) చెప్పారు. రాజ్కోట్లోని శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ సంస్థాన్ 75వ అమృత మహోత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన వర్చువల్ విధానంలో శనివారం మాట్లాడారు.
నూతన జాతీయ విద్యా విధానంలో భావి కాల లక్షణాలున్న, దూరదృష్టిగల విద్యా వ్యవస్థను రూపొందిస్తున్నట్లు తెలిపారు. 2014 నుంచి దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (IITs), ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIMs), వైద్య కళాశాలల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగినట్లు తెలిపారు. IIT, IIIT, IIM, AIIMS వంటి భారీ విద్యా సంస్థల సంఖ్య పెరుగుతోందన్నారు. 2014 తర్వాత వైద్య కళాశాలల సంఖ్య 65 శాతం కన్నా ఎక్కువగా పెరిగిందన్నారు. నూతన విద్యా విధానం ద్వారా భావి కాల లక్షణాలున్న, దూరదృష్టిగల విద్యా వ్యవస్థను రూపొందించడం మన దేశంలో మొట్టమొదటిసారి అని తెలిపారు. భారత దేశ భవిష్యత్తు కాంతులీనాలంటే మన ప్రస్తుత విద్యా విధానం, విద్యా సంస్థలు గొప్ప పాత్ర పోషించవలసి ఉంటుందని తెలిపారు. స్వాతంత్ర్యం లభించిన అమృత కాలంలో విద్యా సంబంధిత మౌలిక సదుపాయాలను, విద్యా విధానాన్ని అత్యంత వేగంగా విస్తరిస్తున్నామని చెప్పారు.