కాగా, ఈ భవనం కోసం ఇప్పటిదాకా మూడు బిడ్లు దాఖలైనట్టు డాన్ దినపత్రిక వెల్లడించింది. అత్యధికంగా రూ.56 కోట్లకు యూదులకు చెందిన ఓ సంస్థ బిడ్ వేసింది. భారత్ కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి రూ.41 కోట్లకు బిడ్ దాఖలు చేయగా, పాకిస్థానీ రియల్టర్ ఒకరు రూ.33 కోట్లకు బిడ్ వేశారు.
వాషింగ్టన్ లోని మూడు చోట్ల పాకిస్థాన్ దౌత్య విభాగానికి ఆస్తులు ఉన్నాయి. వాటిలో ఒకదాన్ని అమ్మకానికి పెడుతున్నట్టు పాక్ వర్గాలు ఈ నెల మొదటివారంలో మీడియాకు తెలిపాయి. ఈ విక్రయానికి పాకిస్థాన్ క్యాబినెట్ ఆమోదం ఉన్నట్టు తెలుస్తోంది.