37.97 శాతానికి చేరుకున్న పాకిస్థాన్ ద్రవ్యోల్బణం

ఆర్థిక పతనం అంచుకుని చేరుకుని నానా కష్టాలు పడుతున్న పాకిస్థాన్‌లో ఇప్పుడు ద్రవ్యోల్బణం రాకెట్‌లో దూసుకెళ్తోంది. మే నెలలో వార్షిక ద్రవ్యోల్బణం ఏకంగా 37.97 శాతానికి ఎగబాకినట్టు అధికారిక డేటా వెల్లడించింది. నిల్వ ఆహారాలు, రవాణా ధరలు మే 2022 కంటే 50 శాతానికి పైగా పెరిగాయి. గత 12 నెలల్లో సగటు ద్రవ్యోల్బణం 29.16గా ఉన్నట్టు పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ గణాంకాలు చెబుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుదల ప్రభావం పేదలు, మధ్యతరగతి కుటుంబాలపై దారుణ ప్రభావం చూపిస్తోందని, వారి ఆదాయం ఆవిరైపోతోందని కరాచీ ఫైనాన్షియర్ మొహమ్మద్ సోహైల్ తెలిపారు. పాకిస్థాన్‌లో ఏళ్ల తరబడి జరిగిన ఆర్థిక దుర్వినియోగం ఆ దేశాన్ని ప్రమాదపుటంచుల్లోకి తీసుకెళ్లింది. దేశంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం దీనికి మరింత ఆజ్యం పోసింది.

For More News Click: https://eenadunews.co.in/

ప్రతిపక్ష నేత, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ను గత నెలలో అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర హింసకు దారితీసింది. కొన్ని రోజులపాటు మొబైల్ ఇంటర్నెట్‌ను బ్లాక్ చేశారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)తో ఒప్పందం చేసుకున్న 6.5 బిలియన్ డాలర్ల రుణం నెలల తరబడి నిలిచిపోయింది.

Leave a Reply

%d