టిఎస్పిఎస్సి ప్రశ్నాపత్రాల లీకుల వ్యవహారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి, రేణుకా ఎవరూ ఉన్నా వదిలిపెట్టేది లేదని కేటీఆర్ అనడం సిగ్గుమాలినతనమన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పేపర్ లీకుల కేసులో ముందుక కేటీఆర్ పిఏ తిరుపతిని విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుపతి గ్రామంలో రాసిన వారిని ప్రతి ఒక్కరికి 100కి పైగా మార్కులు వచ్చాయని అన్నారు. దీనిపై విచారణ జరపాలని కోరారు.