జనగామ ఎస్ఐ కాసార్ల శ్రీనివాస్ దంపతులు ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్య (suicide) చేసుకున్నారు. గురువారం జరిగిన ఈ సంఘటనతో జనగామ జిల్లా కేంద్రంలో విషాదం నెలకొంది. భార్య స్వరూప ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై కాసార్ల శ్రీనివాస్ గదిలోకి వెళ్లి తన సర్వీసులు రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య స్వరూప బాత్రూంలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకోగా ఈ సంఘటన స్వయంగా చూసిన ఎస్ఐ బయటికి వచ్చి బోరున విలపించారు. సమాచారం తెలిసిన చుట్టుపక్కల వాళ్ళు, పోలీసులు అక్కడికి వచ్చి ఘటనపై ఆరా తీస్తుండగా గదిలోకి వెళ్లిన శ్రీనివాస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. స్థానికంగా ఈ సంఘటన కలకలం సృష్టించింది. ఎస్సై శ్రీనివాస్ తల మీద గాయం ఉండడం చర్చకు దారి తీసింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. భార్యాభర్తల మధ్య నెలకొన్న కుటుంబ తగాదాలే ఆత్మహత్యకు కారణంగా చెబుతున్నారు. పోలీసులు సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
ఉరేసుకుని ఎస్సై భార్య ఆత్మహత్య
